Monday, April 29, 2024

కునో పార్క్ నుంచి రెండోసారి తప్పిపోయిన చీతా..

గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. అప్పటి నుంచి వాటిని సంరక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీతాల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వీటిని నమీబియా నుంచి తీసుకొచ్చారు. అయితే…వీటిలో ఓ చీతా చనిపోయింది. కిడ్నీ సమస్యతో చాలా రోజుల పాటు అనారోగ్యానికి గురైన చీతా ఈ ఏడాది మార్చి 27న ప్రాణాలు కోల్పోయింది.

అయితే కునో నేషనల్ పార్క్ నుంచి ఒక మగ చీతా తప్పిపోయింది. గత వారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ బార్డర్‌ని దాటి యూపీలోని అడవిలోకి వెళ్లిపోయింది చీతా. ఇది గుర్తించిన పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చీతా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి పట్టుకుని మళ్లీ నేషనల్ పార్క్‌లోకి తీసుకొచ్చారు. కాగా, ఈ నెలలో చీతా దారి తప్పడం ఇది రెండోసారి.

పార్క్ నుంచి చాలా దూరం ప్రయాణించిన చీతా ఎక్కడో తప్పిపోయింది. కేరళలోని శివ్‌పురి జిల్లా అడవిలోకి వెళ్లిపోయినట్టు గుర్తించారు అధికారులు. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టి శనివారం (ఏప్రిల్ 22) రాత్రి 9.30 నిముషాలకు నేషనల్ పార్క్‌లో వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలోని అడవికి వెళ్తున్న చీతాను గుర్తించి పట్టుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కునో నేషనల్ పార్క్ నుంచి ఝాన్సీ ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement