Friday, May 10, 2024

ఫోన్‌లో ఛాటింగ్ చేసి రూ.15 లక్షలు కొట్టేసిన వంటలక్క

దుబాయ్‌లో ఉంటున్న ఓ యువ‌కుడిని వంటలు చేసే ఓ మహిళ బురిడి కొట్టించింది. మాయ‌మాట‌లు చెప్పి ఏకంగా రూ.15 లక్షల న‌గ‌దు మాయం చేసింది. కానీ చివ‌ర‌కు బాధితుడి ఫిర్యాదుతో బండారం బ‌య‌ట‌ప‌డింది. వేముల‌వాడ‌కు చెందిన గంగారెడ్డి దుబాయ్‌లో ప‌నిచేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలో శుభ‌కార్యాల‌యాలకు వంట‌లు చేసే సునీత‌కు గంగారెడ్డి ఫోన్ నెంబ‌ర్ దొరికింది. ఇంకేముంది వంట‌ల‌క్క పేరు, వాయిస్ మార్చి అత‌న్ని న‌మ్మించింది. నందుగా మూడు నెల‌ల పాటు మ‌రో అమ్మాయి ఫోటోలు పెడుతూ గంగారెడ్డితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ తర్వాత వైశు పేరుతో గంగారెడ్డికి కాల్ చేసి నందూ యాక్సిడెంట్ తో కోమాలోకి వెళ్లింద‌ని, నీవే కార‌ణం అని చెప్తానంటూ బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేసింది. మ‌రో మూడు నెల‌ల‌కు త‌న పేరు సునీత అని‌, వైశుతో పాటు నందు ఇద్ద‌రు ఆసుప‌త్రిలో ఉన్నార‌ని… అందుకు కార‌ణం నువ్వేనంటూ ఆ యువ‌కుడిని బెదిరించింది. దీంతో గంగారెడ్డి దాదాపు 15ల‌క్ష‌ల వ‌ర‌కు ముట్ట‌జెప్పాడు. తీరా దుబాయ్ నుండి వేముల‌వాడ‌కు వ‌చ్చాక‌ తాను మోస‌పోయాన‌ని తెలుసుకొని, పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సునీత‌ను అరెస్ట్ చేశారు. ‌

Advertisement

తాజా వార్తలు

Advertisement