రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ సీట్ల భర్తీకి నిర్వహించనున్న కౌన్సెలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్…. జులై 4 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఇంజినీరింగ్ మొదటి బ్యాచ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జులై 6 నుంచి 13 వరకు, మొదటి బ్యాచ్ వెబ్ ఆప్షన్లు జూలై 8 నుంచి 15 వరకు, 19న ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ జూలై 26 నుంచి నిర్వహిస్తామని.. 27న రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. జూలై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్స్కు అవకాశం ఇస్తామని.. 31న రెండో విడత సీట్ల కేటాయింపు, ఆగస్ట్ 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఆగస్ట్ 9న మూడో విడత కౌన్సెలింగ్కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి.. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్స్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే నెల 13న ఇంజినీరింగ్ మూడో విడత సీట్ల కేటాయించనున్నారు. ఇక ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్ ఉండనున్నది.