Sunday, April 28, 2024

రేపు తూ.గో జిల్లాకి టీడీపీ అధినేత‌ చంద్రబాబు..

ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి అనే కార్య‌క్ర‌మాన్ని టీడీపీ చేప‌ట్టింది. ఏపీ సీఎం జగన్ పాలనను విమర్శిస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ప‌లు జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న ల‌భించింది. జ‌నం కూడా భారీగా త‌ర‌లివ‌చ్చి టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అయితే రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. చంద్రబాబు పర్యటన జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో సాగనుంది. చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతలు రోడ్ షో ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement