Friday, May 3, 2024

చిన్నారిపై చిరుత దాడి – చంద్ర‌బాబు దిగ్ర్భాంతి

అమ‌రావ‌తి – కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం ప‌ట్ల టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు..

కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగింది. ఈ కారణంగా అయినా టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది. అధికారులు సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించి, తగు రక్షణతో భక్తుల భయాన్ని తొలగించాలి. అని చంద్ర‌బాబు కోరారు.

ఇది ఇలా ఉంటే బాలిక ల‌క్షిత చిరుత దాడిలోనే మ‌ర‌ణించింద‌ని ఫొరెన్సిక్ నివేదిక వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement