Saturday, May 4, 2024

ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

రాష్ట్రంలో లో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని… ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఆక్సిజన్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందడం కలచివేసిందని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని… ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement