Friday, May 3, 2024

జార్ఖండ్‌లో మహిళా ఎస్‌ఐ దారుణ హత్య.. రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

హర్యాణలో డీఎస్పీని మైనింగ్‌ మాఫియా హత్య చేసిన ఘటన లాంటిదే ఝూర్ఖండ్‌లోనూ చోటు చేసుకుంది. వాహనాలు తనిఖీ చేస్తున్న మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను దుండగులు వ్యాన్‌తో తొక్కించి హత్య చేశారు. రాంచీలో బుధవారం నాడు తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా పని చేస్తున్న సంధ్య తోప్నో రాంచీలోని తుపుడనా ఓపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో పిక్‌ ఆప్‌ వ్యాన్‌లో అనుమానాస్పద వస్తువులు రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

తనిఖీలకు వెళ్లిన ఎస్‌ఐ వ్యాన్‌ను ఆపాలని కోరారు. డ్రైవర్‌ మాత్రం వ్యాన్‌ను ఆపకుండా ఆమెపై నుంచి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతోనే తనిఖీలకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement