Monday, April 29, 2024

BREAKING: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి… ఎర్ర గడ్డలో బుధవారం ఉదయం ఓ మహిళా మెట్రో స్టేషన్‌ వద్దకు వచ్చింది. ఏంజరిగిందో తెలియదు గానీ.. కాసేపటి తరువాత ఆమె మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకేసింది. ఒక్కసారిగా అక్కడి ప్రయాణికులు షాక్‌ అయ్యారు. వెంటనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో కూడా మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement