Wednesday, May 1, 2024

Breaking : క‌ల్వ‌ర్టును ఢీ కొన్న స్కార్పియో – ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

నంద్యాల జిల్లా…. ఆళ్ళగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర స్కార్పియో జీప్ హెచ్ పి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారు కడప జిల్లా మైదుకూరు టౌన్ లో ప్రొద్దుటూరు ప్రేమ్ చెంద్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు.కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన చీమకుర్తి 1.వెంకటేశ్వర్లు ,భార్యా 2.విజయలక్ష్మి , సామ్రాజ్యమ్మ (వెంకటేస్వర్లు అక్క) ముగ్గురు మృతి చెందారు.. డ్రైవర్ శ్రీనివాసులు.. వెంకటేశ్వ‌ర్లు కూతురు 3.నాగమణి మనుమరాలు 4.మౌనిక ఉన్నారు. మిగతా ముగ్గురికి గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను కర్నూలు జిల్లా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement