Friday, May 3, 2024

Breaking : పంట‌కాలువ‌లోకి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్.. ప్ర‌మాదంలో ఒకరు మృతి..

కాకినాడలోని తాళ్లరేవు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని గోవలంకలో పంటకాలువలోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. దీంతో ఇటుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయప‌డ్డారు. గాయ‌ప‌డిన వ్య‌క్తి ప‌రిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు సుందరపల్లికి చెందిన ప్రసాద్‌ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement