Sunday, April 28, 2024

Breaking : మైసూరులోని ఓ హోట‌ల్ రూంలో రెడ్ హ్యాండెడ్ గా మూడోభార్య‌కి దొరికిన న‌రేష్..ప‌విత్రా లోకేశ్

మైసూరులోని ఓ హోట‌ల్ రూంలో రెడ్ హ్యాండెడ్ గా మూడోభార్య ర‌మ్య‌కి దొరికారు న‌టులు న‌రేష్..ప‌విత్రా లోకేశ్..వీరిపై న‌రేశ్ భార్య రమ్య దాడి చేసేందుకు య‌త్నించింది. ప‌విత్రా లోకేశ్‌పై ఏకంగా చెప్పు తీసుకుని ఆమె దాడి చేసేందుకు య‌త్నించింది. అయితే న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వ‌చ్చిన పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. త‌మ‌పై దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌ను మ‌రింత‌గా ఉడికించేందుకు న‌రేశ్ యత్నించాడు. ర‌మ్య‌ను చూసి విజిల్ వేస్తూ ఆయ‌న వెళ్లిపోయాడు. అంతేకాకుండా చేయి ఊపుతూ, ర‌మ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు.

త‌న భ‌ర్త‌ను త‌న‌కు ద‌క్క‌కుండా ప‌విత్రా లోకేశ్ చేస్తోంద‌ని ర‌మ్య ఆరోపిస్తుంది. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే న‌రేశ్… ప‌విత్రా లోకేశ్‌ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ర‌మ్య ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. న‌రేశ్‌కు ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు కాగా… ర‌మ్య ఆయ‌న‌కు మూడో భార్య‌. ర‌మ్య‌తో చాలా కాలంగా దూరంగానే ఉంటున్న న‌రేశ్… తాజాగా ప‌విత్రా లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. వీరి బంధంపై పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే స్పందించిన న‌రేశ్ త‌మ మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉందంటూ వ్యాఖ్యానించాడు. ప‌విత్రా లోకేశ్ మాత్రం న‌రేశ్‌కు ఆత్మీయ తోడు అవ‌స‌ర‌మ‌ని, కొంత‌కాలంగా అత‌డికి మానసికంగా అండ‌గా నిలుస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలోనే ర‌మ్య వీరిద్ద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిపై దాడికి య‌త్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement