Saturday, May 18, 2024

Breaking : విద్యార్థులు..పోలీసుల మ‌ధ్య తోపులాట‌..కాలేజ్ ని ప్రైవేట్ ప‌రం చేయొద్ద‌ని ఆందోళ‌న‌..

ఐడీఎల్ ఎయిడెడ్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దంటూ కలెక్టరేట్ ను ముట్టడించారు విద్యార్థులు.ఈ సంఘ‌ట‌న
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది.విద్యార్థులు గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బారికేడ్లు, కలెక్టరేట్ గేటును తోసుకుంటూ లోపలికెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement