Thursday, May 2, 2024

Breaking : తెలంగాణ‌లో ‘మీట‌ర్లు’ పెట్ట‌బోం..మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి..

తెలంగాణ‌లో మీట‌ర్లు పెట్ట‌మ‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. రైతుల‌కు కేంద్రం చేస్తున్న మోసంపై బిజెపి నేత‌ల‌ను అడుగ‌డుగునా అడ్డుకోవాల‌ని అన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ పై తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. తెలంగాణ వ‌స్తే అడుక్కు తింటామ‌ని ఆ రోజు ఆంధ్ర వారు అన్నార‌ని ..ఈ రోజు జ‌గ‌న్ బిచ్చం ఎత్తుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. అందుకే మీట‌ర్లు పెడుతున్నార‌న్నారు. నిధులు లేక జ‌గ‌న్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ‌స్తే అడుక్కుతింటార‌ని ఎద్దేవా చేసిన వారే బిచ్చం ఎత్తుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఏపీ న‌డ‌వాలంటే కేంద్రం నిధులు కావాల‌న్నారు. కేంద్రం ఒత్తిడితో ఏపీలో మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టార‌ని ఆరోపించారు. దేశం మొత్తం రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌నేదే ప్ర‌ధాని మోడీ ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement