Monday, April 29, 2024

బెంగళూరులో బాంబ్ పేలుళ్లకు కుట్ర – ఐదుగురు అరెస్ట్

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అయిదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు బుధవారం వీరిని అరెస్ట్‌ చేశారు..

అరెస్ట్‌ అయిన వారిని జునైద్‌, సోహైల్‌, ముదాసిర్‌, ఉమర్‌, జాహిద్‌గా గుర్తించారు. వీరి నుంచి సెల్‌ ఫోన్లు, పేలుడు పదార్థాలతోపాటు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో మరో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం జల్లెడపడుతున్నారు.

- Advertisement -

కాగా అరెస్ట్‌ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కొంతకాలం బెంగుళూరు సెంట్రల్‌ జైలులో శిక్షననుభవించారని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి పేలుడు పదార్థాలను నిర్వహించడంలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement