Thursday, April 18, 2024

సోనూసూద్‌కు బీఎంసీ షాక్‌.. ఇంటిని హోటల్‌గా మార్చారని నోటీసు

ముంబై : రియల్‌ హీరో, నటుడు సోనూసూద్‌కు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. ఆరు అంతస్తుల నిర్మాణాన్ని హోటల్‌గా మార్చారని సోనూసూద్‌కు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆరు అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కాగా.. దానిని హోటల్‌గా మార్చారని, తిరిగి ఆ భవనాన్ని ఇంటిగా పునరుద్ధరించాలని గుర్తు చేస్తూ.. నవంబర్‌ 15న నోటీసులు బీఎంసీ జారీ చేసింది. మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్‌ కుస్ములు సోనూసూద్‌పై బీఎంసీకి ఫిర్యాదు చేశారు.

రెసిడెన్షియల్‌ భవనాన్ని బాలికల వసతి గృహంగా మార్చారని.. దాన్ని హోటల్‌గా మార్చారని, ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ భవంతిని కూల్చేయాలని కోరారు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే బీఎంసీకి సోనూసూద్‌కు మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇక ఇదే విషయంపై సోనూసూద్‌ సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఆ తరువాత హైకోర్టు విచారణ అనంతరం తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుని.. ఆ హోటల్‌ను తిరిగి నివాస భవనంగా మార్చేందుకు అంగీకరించారు.

ఇక తాజాగా బీఎంసీ పంపిన నోటీసులో.. భవనంలోని 1 నుంచి 6వ అంతస్తులలో మీరు వసతి.. బోర్డింగ్‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్‌ ప్రకారం.. ఆ భవనం కేవలం నివాస అవసరాలకు మాత్రమే ఉపయోగించబడుతుందని మీరు పేర్కొన్నారు. అదనంగా/మార్పు/పురోగతిలో అవసరమైన పని మార్పు ఉంది. కానీ.. అక్టోబర్‌ 20న భవనాన్ని పరిశీలించగా.. ఆమోదించబడిన ప్లాన్‌ ప్రకారం.. మీరు ఇంకా ఈ భవనాన్ని పునరుద్ధరించలేదు. మీరు భవనాన్ని నివాసం కోసం పునరుద్ధరిస్తామని జులైలోనే మాకు హామీ ఇచ్చారు అంటూ బీఎంసీ గుర్తు చేసింది. ఇక ఆ భవనం పునరుద్ధరణ కోసం సోనూసూద్‌కు ఏడు రోజుల సమయం బీఎంసీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement