Monday, April 29, 2024

నేడు గురుమూర్తి, రత్నప్రభ ల నామినేషన్

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఫిజియోథెరపిస్ట్ గా ఉన్న గురుమూర్తి కి ఆ సీటును కేటాయించారు. కాగా తిరుపతి లోక్ సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి… పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరవనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి అభ్యర్థిగా రత్నప్రభ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement