Sunday, April 28, 2024

పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిని మార్చిన బీజేపీ.. బాలసుబ్రహ్మణ్యం ప్లేసులో బక్షి నియామకం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా జరుపుతున్న మార్పులు చేర్పుల్లో భాగంగా కీలకమైన పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిని మార్చింది. ఇన్నాళ్లూ ఆ స్థానంలో పనిచేసిన కామర్సు బాలసుబ్రహ్మణ్యం స్థానంలో డా. శివశక్తినాథ్ బక్షిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీజేపీ పబ్లికేషన్స్ జాతీయ కన్వీనర్‌గా, ‘కమల్ సందేశ్’ ఎడిటర్‌గా డా. బక్షి కొనసాగుతున్నారు.

పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన బీజేపీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ, పార్లమెంటరీ పార్టీ నిర్ణయాలను అమలుపరిచే కీలక బాధ్యతల్ని పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంతకాలం పాటు ఈ పదవిలో తెలుగు వ్యక్తి కామర్సు బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు. ఈ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ఆయనకు తెలంగాణలో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement