Thursday, March 28, 2024

Delhi: కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో మార్పులు, చేర్పులు.. ఎవరెవరిని మార్చారో తెలుసా!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో పార్టీ అనుబంధ విభాగాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న అధిష్టానం, తాజాగా ఆదివాసీ కాంగ్రెస్‌‌తో పాటు సోషల్ మీడియా విభాగంలో కొన్ని మార్పులు, చేర్పులు, కొత్త నియామకాలు చేపట్టింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో నిరంతరం అనుసంధానమయ్యేందుకు వీలుగా ఆ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తూ 8 మంది నేషనల్ కోఆర్డినేటర్లను నియమించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అరుణ్ బీరెడ్డికి చోటు కల్పించింది.

మరోవైపు ఆదివాసీ కాంగ్రెస్ విభాగంలో డా. బెల్లయ్య నాయక్ తేజావత్‌ను వైస్ చైర్మన్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయనతో పాటు వైస్ చైర్మన్‌గా డా. ప్రదీప్ కుమార్ బల్ముచును నియమించింది. ఈ విభాగం నేషనల్ కోఆర్డినేటర్లు ముగ్గురుని నియమించడంతో పాటు మహారాష్ట్ర, అండమాన్ – నికోబార్, దాద్రా & నాగర్ హవేలి ప్రాంతాల ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్లను నియమించింది. అలాగే పంజాబ్ రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్, నాగాలాండ్ పీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్లను కూడా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement