Monday, April 29, 2024

Big Fight – రాజ‌స్తాన్ లో భ‌ర్త పైనే భార్య పోటీ…

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దాంతా రామ్ గఢ్ నియోజకవర్గం ఎన్నికలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.. ఈ నియోజకవర్గంలో భార్యాభర్తలు బరిలో నిలవడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 25న రాజస్థాన్ లో పోలింగ్ జరగనుంది. దాంతా రామ్ గఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ నే మరోమారు బరిలో దింపాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. అయితే, రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వీరేంద్ర సింగ్ భార్య రీటా చౌదరి ఈసారి పార్టీ టికెట్ ఆశించారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. అయినా ఉపయోగం లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) లో చేరి దాంతా రామ్ గఢ్ టికెట్ సంపాదించారు. దీంతో నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. భార్య‌, భ‌ర్త‌ల గెలుపుపై అప్పుడే పందాలు జోరందుకున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement