Monday, April 29, 2024

కీవ్‌కు బైడన్‌?.. ఉక్రెయిన్కు సంఘీభావంగా పర్యటన

రష్యాను ప్రతిఘటిస్తూ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న ఉక్రెయిన్‌కు సంఘీభావంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరలో రాజధాని కీవ్‌లో పర్యటించే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా అమెరికాకు చెందిన కీలక నాయకులు కీవ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆదివారంనాడు అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ కీవ్‌లో పర్యటించి ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి సరిహద్దున ఉన్న పోలండ్‌కు చేరుకున్నారు. వార్సాలో సోమవారంనాడు అధ్యక్షుడు ఆంద్రజెజ్‌ దుడాతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు అండగా నిలిచి ఉదారంగా సాయం చేస్తూండటాన్ని ప్రశంసించారు. రష్యా యుద్ధం మొదలైన తరువాత 55 లక్షలమంది వలసవెళ్లారని, వారిలో 30 లక్షలమంది కేవలం పోలండ్‌లోనే తలదాచుకున్నారని, ఇంతమందికి ఆశ్రయం ఇవడం సాధారణ విషయం కాదని ఆమె అన్నారు. నాటో విస్తరణ అంశంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement