Friday, April 26, 2024

భేడియా ప్రమోషన్స్.. స్కూల్ కి వెళ్లిన కృతిసనన్

భేడియా మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్. 15 ఏళ్ల తర్వాత తన స్కూల్ కు వెళ్లింది. తన సినిమాను ప్రమోట్‌ చేసేందుకు స్కూల్‌కు వెళ్లింది కృతిసనన్‌. నా స్కూల్‌కు తిరిగి రావడం గొప్ప అనుభూతినిస్తోందని ట్వీట్ చేసింది. కృతిసనన్ స్కూల్‌ గేట్‌ ముందు హ్యాపీ మూడ్‌లో దిగిన స్టిల్‌తోపాటు షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది ప్రస్తుతం వరుణ్ ధావన్‌ నటిస్తోన్న భేడియా చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది కృతిసనన్. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో వస్తోంది.

ఈ మూవీ నవంబర్‌ 25న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది కృతిసనన్‌. ప్రమోషన్స్ లో భాగంగా తన స్కూల్‌కు రావడం గొప్ప అనుభూతినిచ్చిందంటోంది కృతిసనన్‌.15 ఏండ్ల తర్వాత..తిరిగి స్కూల్‌కు వచ్చా. నేను నటించిన భేడియా చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు నా స్కూల్‌కు తిరిగి రావడం చాలా గర్వకారణంగా ఉంది. డి.పి.ఎస్. ఆర్.కె.పురం నాకు చాలా ఇచ్చింది. నిజంగా నన్నొక ఉత్తమ వ్యక్తిలా తీర్చిదిద్దిందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement