దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కాగా కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయో టెక్.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును రూ. 600కు ఇస్తామని ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 1200కు విక్రయిస్తామని.. ఎగుమతి కోసమే 15-20 డాలర్లకు ఇస్తామని ప్రకటించింది.
కాగా కేంద్ర ప్రభుత్వానికి భారత్ బయోటెక్ ఒక్కో డోసును రూ.150కే విక్రయిస్తోంది. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే వాటిలో 50శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికే ఇస్తోంది.