Saturday, May 18, 2024

అవయవదానం చేసి ప్రాణం పోసిన బీటెక్ విద్యార్థి

వరంగల్ కేయుసి క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం( మే 2న) తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కిట్స్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న రిత్విక్(19) గాయపడ్డారు. బ్రెయిన్ డెడ్ కావటంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. రిత్విక్ అవయవాలు దానం చేయాలని తల్లిదండ్రులు తంగళ్లపల్లి గిరిధర్, రజని నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేసి మరికొందరికి ప్రాణం పోశారు. మృతుని తండ్రి హన్మకొండలోని కొహినూర్ కాంప్లెక్సులో గల వెంకటేశ్వర జ్యూవెలర్స్ యజమాని. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నక్కలగుట్టలోని గిరిధర్ ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement