Friday, May 17, 2024

15వేల బడుల్లో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌.. లోగోను ఆవిష్కరించిన తపస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆగస్టు 1వ తేదీన రాష్ట్రంలోని 15000 పాఠశాలల్లో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రాన్ని చేపడుతున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) తెలిపింది. ఈ సందర్భంగా సోమవారం తపస్‌ రాష్ట్ర సంఘం కార్యాలయంలో లోగో, కరపత్రాన్ని ఆవిష్కరించినట్లు అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్‌ సురేష్‌ తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెంటయ్య, లక్ష్మీకాంత్‌, మల్లికార్జున్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement