Friday, May 10, 2024

Ayodhya:పూల వ్యాపారి ఇంటికి పీఎం.. స‌ర‌ద‌గా టీ తాగిన మోడీ

ప్ర‌ధాన‌మంత్రి అయోధ్య ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ ఇంట్లోకి వెళ్లి ప్ర‌ధాని మోడీ టీ తాగి వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు. పీఎం ఉజ్వల పథకం 10 కోట్ల మంది లబ్ధిదారుల్లో ఒకరైన ఓ మహిళ ఇంటికి ప్రధాని మోదీ అకస్మాత్తుగా వెళ్లారు.

ఆ క్రమంలో మహిళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ఆమె పిల్లలతో కూడా మోదీ కాసేపు సరదాగా గడిపి టీ సేవించారు. ఆ తర్వాత ప్రధాని వారి జీవన విధానం గురించి ఆరా తీశారు. ఆ మహిళ మీరా అయోధ్యలో పూల వ్యాపారిగా పనిచేస్తోంది. మహిళ భర్త సూరజ్, పిల్లలను మోదీ కలిశారు. ఆమె ఏం పని చేస్తుందని ప్రధాని ప్రశ్నించారు. మీరా ప్రధానితో మాట్లాడుతూ తాము పూల వ్యాపారం చేస్తున్నామని సమాధానం ఇచ్చింది. అది విన్న ప్రధాని మోదీ గుడి నిర్మాణంతో మీ పూల వ్యాపారం బాగుపడుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement