Thursday, May 2, 2024

National : అయోధ్య హ‌నుమాన్‌ ప్రసాదం…ఇక‌ నేరుగా ఇంటికే..

అయోధ్య రాంల‌ల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. కేవలం బాలరాముడినే కాకుండా ఆ నగరంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలనూ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రద్దీ పెరగడంతో అయోధ్యలో ఉన్న హనుమాన్‌గఢీ ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో హనుమాన్ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరవేయాలని ఆ ఆలయ నిర్వాహకులు భావించారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో భారతీయ తపాలాశాఖ హనుమాన్‌ గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్‌ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి ‘డిప్యూటీ పోస్ట్‌మాస్టర్‌, అయోధ్య ధామ్‌ -224123’ చిరునామాతో ఈ-మనీ ఆర్డర్‌ తీయాలి. భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్‌ చేయాలి. పిన్‌కోడ్‌, ఫోన్‌ నంబరు తప్పనిసరి. ఇలా ఆర్డర్‌ చేశాక స్పీడ్‌పోస్టు ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగ్‌రాజ్‌, వారణాసి జోన్‌ పోస్ట్‌మాస్టర్‌ కృష్ణకుమార్‌ తెలిపారు. రూ.251 మనీఆర్డర్‌కు లడ్డూలు, హనుమాన్‌ చిత్రం, మహావీర్‌ గంధం, అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement