Friday, May 17, 2024

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌-ముందంజ‌లో ఉన్న వైసీపీ

ఏపీలోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ జ‌రుగుతోంది. కాగా ముందంజ‌లో ఉంది అధికార పార్టీ వైసీపీ.
కాగా ఇప్పటివరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగో రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 17,385 ఓట్ల మెజారీటి వచ్చింది. ఇప్పటివరకు ఆయనకు 21,043 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 3,658 ఓట్లురాగా, బీఎస్పీ అభ్యర్థి 683, నోటాకు 699 ఓట్లు పోలయ్యాయి. దీంతో రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెరుగుతుంటంతో వైసీపీ భారీ ఆధింక్యంతో గెలిచే అవకాశం ఉన్నది. మధ్యాహ్నంలోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది.ఈ నెల 23న ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగింది. మొత్తం 2,13,338 ఓట్లు ఉండగా, 1,37,081 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్‌ ఓట్లు 493 ఉన్నాయి. మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు, 20 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. కాగా, విక్రమ్‌ రెడ్డి ఆధిక్యం భారీగా ఉండటంతో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ కౌంటింగ్‌ హాల్‌ నుంచి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement