Sunday, March 24, 2024

క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కుటుంబంపై దాడి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి తమ ఇంటిపై నిమ్మకాయలు వేశారని, క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో మ‌రో కుటుంబానికి చెందిన‌ సభ్యులు అనుమానిత కుటుంబంపై దాడి చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించారు. ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌ను స్థానికుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement