Thursday, May 2, 2024

Assembly: దివంగ‌త మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఘ‌న నివాళి

దివంగ‌త మాజీ ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీలో శాస‌న స‌భ్యులు ఘ‌న నివాళులు అర్పించారు. ఇవాళ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేపథ్యంలో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. సభ్యులందరూ లేచి నిలబడి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

అనంత‌రం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క పీపీటీ ప్రారంభించారు. దశాబ్ద కాలం పాలించిన గత పాలకులు, అన్ని వనరులను అనుకున్న దిశగా నడిపించలేదని ఆగ్రహించారు. రోజు వారి ఖర్చులు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఆర్థిక ఆరాచకత్వం జరిగింది…ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వివరించారు. అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement