Saturday, May 4, 2024

Asian Games – భారత్‌ కు ఆర్చరీలో మరో స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. ఆర్చరీ మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్‌, అదితి గోపిచంద్‌, పర్ణీత్‌ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్‌లో చైనీస్‌ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్‌ ఖాతాలో 82 పతకాలు చేరాయి. ఇందులో 19 స్వర్ణాలు, 31 కాంస్యాలు, 32 రజత పతకాలు ఉన్నాయి. కాగా, ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఫైనల్‌లో ఓజాస్‌ డియోటల్‌, జ్యోతి సురేఖ జట స్వర్ణం సాధించింది. అదేవిధంగా సునీల్‌ కుమార్‌, గ్రెసొ జంట రజతం గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement