Tuesday, May 21, 2024

ఏసియన్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్స్‌.. ప్రణతి నాయక్‌కు కాంస్యం

ఏసియన్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్‌ ప్రణతి నాయక్‌ అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్యం చేజిక్కించుకుంది. వాల్ట్‌ టేబుల్‌ కాంపిటీషన్‌ ఫైనల్స్‌లో ప్రణతి 13,367 పాయింట్లుతో మూడో స్థానంలో నిలవగా, దక్షిణ కొరియా అథ్లెట్‌ యెవో సీవోజియాంగ్‌ 14,084 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, మియాట షోకో 13,884 పాయింట్లతో రెండో స్థానంతో వెండి పతకం సాధించింది.

ప్రణతి నాయక్‌ 2019 టోర్నీలో కూడా 13,384 పాయింట్లతో కాంస్యం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా ప్రదర్శనతో ప్రణతి నాయక్‌ లివర్‌పూర్‌లో జరుగనున్న ఎఫ్‌ఐజీ వరల్డ్‌ ఆర్టిస్టిక్స్‌ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement