Wednesday, May 1, 2024

21 రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు రాక‌.. రికార్డు స్థాయిలో అమర్‌నాథుని దర్శనాలు

దక్షిణ కశ్మీర్‌లో జులై ఒకటవ తేదీన అమర్‌నాథ్‌ యాత్ర మొదలైన తొలి 21 రోజుల్లో 3,07,354 భక్తులు అమర్‌నాథ్‌ గుహ క్షేత్రాన్ని దర్శించుకున్నారని జమ్మూ కాశ్మీర్‌ సమాచార, పౌర సంబంధాల విభాగం తెలిపింది. మౌలిక సదుపాయల అభివృద్ధి, సంబంధిత ప్రభుత్వ సేవల కారణంగా గత ఏడాది కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ సంఖ్యలో పవిత్ర గుహను దర్శించుకున్నారని పేర్కొంది.

- Advertisement -

యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి దాదాపు 30 ప్రభుత్వ విభాగాలు సేవలు అందిస్తున్నాయి. అంతేకాకుండా 100 పడకలతో కూడిన రెండు ఆసుపత్రుల నిర్మాణం అనారోగ్యం పాలైన యాత్రికులకు సత్వర చికిత్స అందించడానికి ఉపకరించింది. ప్రతి యాత్రికుల శిబిరం వద్ద నియుక్తులైన వైద్య, ఆరోగ్య నిపుణుల బృందం ప్రతి రోజూ వందలాది యాత్రికులకు వైద్య సేవలు అందించడంతో పాటుగా వారికి అవసరమైన మందులను సమకూర్చారని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement