Thursday, May 2, 2024

Breaking | మోయ తుమ్మెద వాగులో కారు గల్లంతు.. సిద్దిపేట జిల్లాలో ఘ‌ట‌న‌

నంగునూరు, (ప్ర‌భ న్యూస్‌): సిద్దిపేట జిల్లాలో ఘోరం జ‌రిగింది. నంగునూరు మండలం అక్కినపల్లి గ్రామ వాగు దాటుతున్న క్రమంలో ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. ఇది చూసిన‌ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోహెడ మండలం పోరెడ్డిపల్లి నుంచి అక్కన్నపెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స‌మాచారం. కారు వాగు ప్రవాహం దాటుతుండగా కొట్టుకుపోయిందని, తాము మరోపక్క ఉండి హెచ్చరించినప్పటికీ కారు రివర్స్ లో వెళ్లి వేగంగా ప్రవాహం దాటే క్రమంలో నీళ్లలోకి రాగానే లైట్లు ఆగిపోయి తర్వాత కారు కనబడలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement