Wednesday, May 1, 2024

ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు పూర్తి..

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌- 2022లో ఎంపీసీ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ వరకు పది సెషన్లలో జరిగిన పరీక్షలకు 2 లక్షల 6 వేల 579 మంది రిజిస్టర్‌ చేసుకోగా..

లక్షా 94 వేల 752 మంది హాజరైనట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. హాజరు శాతం 94.27 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు జరగాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement