Sunday, April 28, 2024

కానిస్టేబుల్ సంధ్యారాణి కేసులో మరో ట్విస్ట్…భర్తే అసలు దొంగ

కానిస్టేబుల్ సంధ్యారాణి మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ విషయాన్ని దాచి పెట్టి మోసం చేసిందని తనని కూడా ఆర్య సమాజ్ వివాహం చేసుకుందని చరణ్ తేజ డిసిపి కి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా తనను వేధిస్తోందని…తల్లిదండ్రులను, స్నేహితులను కలవకుండా చేస్తోందని ఆమె నుంచి ఆమె కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.

అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. కానిస్టేబుల్ సంధ్యారాణిపై భర్త చరణ్ తేజ దుష్ప్రచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు భర్త పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కులం పేరుతో దూషించి వేధింపులకు గురి చేస్తున్నట్లు కానిస్టేబుల్ సంధ్యారాణి ఫిర్యాదులో పేర్కొంది. ipc 498a ,506 వరకట్న నిరోధక చట్టం తోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement