Friday, April 26, 2024

సినీ పరిశ్రమలో మ‌రో విషాదం.. హిట్ మూవీస్ డైరెక్ట‌ర్‌ మదన్ ఇక లేరు

టాలీవుడ్‌లో మరో విషాదం అలుముకున్నది. ప్రముఖ దర్శకుడు ఆర్‌ ఆర్‌ మదన్ ఇవ్వాల చ‌నిపోయారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గుర‌యిన మ‌ద‌న్‌ని ఆయ‌న కుటుంబ సభ్యులు అపోలో హాస్పిట‌ల్‌కి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఇవ్వాల (శనివారం) రాత్రి చ‌నిపోయారు. పెళ్లయిన కొత్తలో’, గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’, ‘కాఫీ విత్‌ వైఫ్‌’, ‘గాయత్రి’, ‘గరం’ వంటి చిత్రాలకు మ‌ద‌న్ దర్శకత్వం వహించారు. ‘ఆ నలుగురు’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. మదన్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. మదన్‌ మృతిపై పలువురు టాలీవుడ్‌ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement