Monday, April 29, 2024

Loans | ఆర్బీఐ నుంచి మరో 3 వేల కోట్ల రుణం.. బాండ్ల వేలం ద్వారా సేక‌ర‌ణ‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ నుంచి మరో రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.3 వేల కోట్లు అప్పు చేసింది. వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 16 సంవత్సరాలకు 7.52 శాతం వడ్డీతో రుణం పొందింది.

ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ మూడు వేల కోట్లతో ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 వేల 500 కోట్లు రుణం పొందింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లో రూ.25 వేల కోట్లు అప్పు చేసింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బిఎంలో ఇంక ఐదు వేల కోట్లు- మాత్రమే మిగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement