Monday, April 29, 2024

కరోనా థర్డ్ వేవ్‌కు కూడా మందు కనిపెడతా: ఆనందయ్య

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నివారణకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన నెల్లూరు ఆనందయ్య మరో కీలక ప్రకటన చేశారు. కరోనా థర్డ్ వేవ్‌కు కూడా మందు కనిపెడతానని చెప్పారు. థర్డ్ వేవ్ లక్షణాలు చూశాక మందు తయారుచేస్తానని తెలిపారు. ప్రస్తుతం కరోనా మందు కావాలన్న వారికి ఆనందయ్య కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతున్నారు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఆనందయ్య మందు తయారు చేయకపోయినా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆయుర్వేద మందు తయారు చేసి ఉచితంగా అందించారు. ఇది కాస్తా.. ఊరూరా పాకిపోయింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందుపై పరిశోధనలు చేయడం, మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని తేల్చడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఆనందయ్య మందు అంశం హైకోర్టు వరకు చేరడంతో ఆయన మందుకు అనుమతి లభించింది. అయితే, ఎవరూ కృష్ణపట్నం రావొద్దని.. ఎక్కడికైనా తామే పంపుతామని చెప్పి.. దానికి అనుగుణంగానే ఆనందయ్య తన కరోనా మందు పంపిణీ చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: మైనర్ బాలుడి బైక్ డ్రైవింగ్.. పోలీసులతో ఓవరాక్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement