Saturday, May 11, 2024

రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు : మంత్రి జగదీశ్‌ రెడ్డి

కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని, రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యాపేటలో తన నివాసంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అన్నారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఆప్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టె కుట్రలో భాగంగానే నోటీలు, అరెస్టులని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి పప్పులు సీఎం కేసీఆర్‌ ముందు ఉడకవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement