Friday, April 26, 2024

తెలుగు పాట‌ పాడిన ఆలియాభ‌ట్-ఆశ్చ‌ర్య‌పోయిన గెస్ట్ లు

రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌ర‌గాల్సిన బ్ర‌హ్మ‌స్త్రం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. దాంతో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.. రణ్‌బీర్ క‌పూర్ , అలియాభ‌ట్ , నాగార్జున, మౌనీరాయ్, నిర్మాత కరణ్ జొహార్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అలియాభ‌ట్ తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్టీ టాలెంటెడ్ అయిన అలియా లైవ్ లోనే ‘బ్రహ్మస్త్రం’ చిత్రంలోని ‘కుంకుమలా’ అనే పాటను చాలా అందంగా ఆలపించింది. తన ప్రసంగాన్ని తెలుగు పాటతో ముగిస్తాన‌ని చెప్పిన అలియా తాను బాగా ప్రిపేర్ అయి వచ్చానంది. ఇక ఆమె పాట అందుకోగానే అక్కడున్న అతిథులు, మీడియా ప్రతినిథులు అంతా ఆశ్చర్యపోయారు. భర్త రణ్ బీర్ అయితే ఆమెనే చూస్తుండిపోయాడు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడగా.. ఆలియా పాట ఫీమెల్ వెర్షన్ లా అనిపించింది. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement