Monday, April 29, 2024

కేదార్ నాథ్ ఆల‌యం ద‌ర్శించిన అక్ష‌య్ కుమార్.. భారీ భ‌ద్ర‌త‌

కేదార్ నాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించారు బాలీవుడ్ స్టార్‌ నటుడు అక్షయ్‌ కుమార్.. దాంతో అక్ష‌య్ కుమార్ కి భారీ భ‌ద్ర‌త‌ని క‌ల్పించారు. ఆలయానికి చేరుకున్న అక్షయ్‌ కుమార్‌.. స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ‘బడేమియా చోటే మియా చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వసూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉందీ సినిమా. వచ్చే ఏడాది వేసవికి హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement