Monday, May 6, 2024

గంభీర్ ఫౌండేషన్‌కు అక్షయ్ రూ.కోటి విరాళం

సినీ న‌టుడు అక్ష‌య కుమార్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం కృషి చేస్తున్న మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రూ. కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విష‌యాన్ని గంభీర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అక్ష‌య్ ఇచ్చింది కేవ‌లం డబ్బు మాత్ర‌మే కాద‌ని.. ఎంద‌రో జీవితాల‌కు అదో ఆశాకిర‌ణ‌మ‌ని అభివ‌ర్ణించారు. ఆ డ‌బ్బును త‌న ఫౌండేష‌న్ ద్వారా ఫుడ్, మెడిసిన్స్, ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మైన వారి కోసం వినియోగిస్తామ‌ని చెప్పారు.

గంభీర్ ట్వీట్‌పై అక్ష‌య్ కూడా స్పందించారు. ‘ఇది చాలా క‌ఠిన‌మైన స‌మ‌యం. సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను. త్వ‌ర‌లోనే ఈ సంక్షోభం నుంచి మ‌న‌మంతా బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని ఆశిస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చారు. గ‌తేడాది కూడా అక్ష‌య్ కుమార్ పీఎం కేర్స్‌కు ఏకంగా రూ. 25 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం అక్ష‌య్ కుమార్ కూడా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement