Sunday, May 5, 2024

Maharashtra: శరద్‌ పవార్‌ను కలిసిన అజిత్‌ పవార్‌

ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఎన్సీపీ నుంచి తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ సహా పలువురు నేతలు ఈరోజు ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ను కలిశారు.ఆయనను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌తో పాటు ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు.

తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి వీరంతా ఆయన్ను కలవడం గమనార్హం. జులై 2న ఎన్సీపీ నుంచి ఓ గ్రూపుగా చీలిపోయిన అజిత్‌ పవార్‌ ఆ తర్వాత భాజపా-శిందే సారథ్యంలోని మహారాష్ట్ర సర్కార్‌లో భాగస్వాములైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement