Friday, May 3, 2024

ఎయిరిండియా విమానం ఇంజిన్ లో మంట‌లు-14మందికి అస్వ‌స్థ‌త‌

ఎయిరిండియా విమానం ఇంజిన్ లో మంట‌లు చెల‌రేగాయి. దాంతో విమానంలో ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. ఈ సంఘ‌ట‌న మ‌స్క‌ట్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. విమానం ఇంజిన్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగడంతో విమానం అంతా పొగతో నిండిపోయింది. ఆ సమయంలో విమానంలో 145 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. వెంటనే వారిని విమానం నుంచి కిందికి దింపేశారు. తోక భాగం వద్ద స్లైడ్ డోర్ (జారుడు బల్ల తరహా ద్వారం) తెరిచి వారిని సురక్షితంగా దించేశారు. వారిని టెర్మినల్ బిల్డింగ్ లోకి తరలించారు. ఈ ఘటనలో 14 మంది అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ విమానం బుధవారం మస్కట్ నుంచి కేరళలోని కొచ్చి రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement