తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. జిల్లాలోని జగదేవపూర్ మండల కేంద్రంలో గల అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల వెనకాల గల కాళీ స్థలంలో ఎయిర్ పోర్స్ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో క్రిందికి దిగింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడి ఉండడంతో స్థానిక ఎస్ఐ రాజు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రజలను చెదరగొట్టారు. పోలీసులు హెలికాఫ్టర్ సిబ్బందికి భద్రత కల్పించారు. రిపేర్ కోసం మరో హెలికాప్టర్ అక్కడకు రానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..