Sunday, May 5, 2024

Agnipath: రిక్రూట్​మెంట్​ షురూ.. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ కోసం 1.83లక్షల మంది దరఖాస్తు

అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) రిక్రూట్‌మెంట్ కోసం 1.83 లక్షల మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 5వ తేదీ దాకా ఉన్నట్టు ఐఏఎఫ్​ తెలిపింది. ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా నిరసనకారులు రైళ్లను తగులబెట్టారు, బస్సులను ధ్వంసం చేశారు, దీంతో దాదాపు వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిళ్లినట్టు పలు సందర్భాల్లో అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement