Sunday, April 28, 2024

కాబుల్ ఎయిర్ పోర్టులో మరోసారి కాల్పులు..

ఆఫఘనిస్తాన్ లో గంటగంటకు పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. తాలిబాన్లు కాబూల్ లోని అధ్యక్ష భవనంపై జెండా ఎగురవేయడంతో..భయంతో ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎయిర్ పోర్టులోకి ప్రజలు వరదలా పోటెత్తుతున్నారు. దీంతో ప్రజలను అదుపులోకి తీసుకురావడం కోసం అమెరికా సైన్యం మరోసారి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తాలిబాన్లు కాబూల్ సరిహద్దుల్లోకి రాగానే ప్రజలు దేశాన్ని వీడేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. దాంతో తమ విమానాలకు భద్రత కల్పించే క్రమంలో అమెరికా సైనికులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టులో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా సైనికులు ఇద్దరు సాయుధులను కాల్చి చంపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వారికి ఆయన ఏ విధమైన భరోసా ఇస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆఫ్ఘన్ తాజా సంక్షోభానికి బైడెన్ విధానాలే కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రసంగంపై యావత్ ప్రపంచం వేచిచూస్తోంది.

ఇది కూడా చదవండి: ప్ర‌శ్నిస్తే అక్ర‌మ అరెస్టులు.. ఇదేం అరాచ‌క ప్ర‌భుత్వం?

Advertisement

తాజా వార్తలు

Advertisement