Monday, April 29, 2024

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు 22 వరకు గడువు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు ఈనెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. అలాగే 6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 2వ తేదీ లోగా ఎంజెపిటి బీసీ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ డాట్‌ తెలంగాణ డాట్‌ జీవోవి డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. జూనియర్‌, డిగ్రీ కోర్సుల్లో చేరాలనునే విద్యార్థులకు జూన్‌ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement