Thursday, May 2, 2024

Accident – ట్రాక్టర్‌ను ఢీకొన్న వోల్వో బస్సు – నలుగురి దుర్మరణం

అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరోగార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రాక్టర్ ను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు.కాగా, ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని… తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వోల్వో బస్సు ఢీకొనడంతో బియ్యం బస్తాలు సైతం రోడ్డు దాటి ఎగిరిపడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా అతివేగంతో ఓల్వో బస్సు ఢీకొనటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement