Sunday, May 5, 2024

Accident – వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా మృత్యు కాటు – ఐదుగురు దుర్మరణం

తమిళ నాడులోని తిరుపూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే నలుగురు మృతిచెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు.

రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించినవారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement